తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున రత్నప్రభ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమెపై సిపిఐ నారాయణ కాంట్రవర్సీ కామెంట్ ఇటీవల చేయడం జరిగింది.
రత్న ప్రభా కళంకితురాలు, ఓటేయొద్దని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో తన పై నారాయణ చేసిన వ్యాఖ్యలకు రత్నప్రభ కౌంటర్ వేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికైన టైములో సోషల్ మీడియాలో ఆయన అభినందించటం వాస్తవమే అని స్పష్టం చేశారు.
అలా అభినందిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అలాంటప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.తనపై కామెంట్లు చేసిన నారాయణ అనే వ్యక్తిని ఇప్పటివరకు కలవలేదని, అలాంటప్పుడు తన గురించి ఆయనకు ఎలా తెలుస్తుంది అని నారాయణ పై కౌంటర్లు వేశారు.
నేను ఏదైనా తప్పు చేసి ఉంటే కర్ణాటక ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది.నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం అని స్పష్టం చేశారు.
తన అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేయడం జరిగిందని పేర్కొన్నారు.అంతేకాకుండా తన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి కూడా వస్తారని రత్నప్రభ తెలిపారు.