తెలంగాణ రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో వైయస్ షర్మిల పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీ మద్దతుదారులతో ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నారు.
విద్యార్థులతో, మహిళలతో అదేవిధంగా గిరిజనులతో వివిధ వర్గాలకు చెందిన వాళ్లతో భేటీ అవుతున్నారు.ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే చాలా మంది ప్రముఖులు మరియు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా షర్మిల తో భేటీ అవుతూ ఉన్నారు.
ఇలాంటి తరుణంలో తాజాగా లోటస్ పాండ్ లో సానియా మిర్జా సోదరి అన్నం మిర్జా అదేవిధంగా అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ షర్మిల తో భేటీ అయ్యారు.దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారింది.
సెలబ్రిటీలు . మోటివేషనల్ స్పీకర్ షఫీ ఇంకా చాలామంది నాయకులు షర్మిలతో భేటీ అవుతూ ఉన్న తరుణంలో. రాజకీయంగా ఆమె వ్యవహరిస్తున్న తీరు అనేక సంచలనాలకు దారి తీస్తుంది. ఇదిలా ఉంటే ముందు పాదయాత్ర చేపట్టి ఆ తర్వాత పార్టీ ప్రకటన చేయాలని షర్మిల టీమ్ ఆలోచన చేస్తున్నట్లు టాక్.
పాదయాత్ర ఉండటంవల్లే ముందుగానే మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.