తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ గురించి తెలియని వారంటూ ఉండరు.జగడం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో.
తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇక వరుస అవకాశాలను అందుకుంటూ మంచి క్రెజ్ ని సంపాదించుకున్నాడు.
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో మరోసారి తన ఫాంలోకి వచ్చాడు హీరో రామ్ పోతినేని.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో రెడ్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చి సందడి చేసిన యువ హీరో రామ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రెడ్ మూవీ ప్రమోషన్ల సమయంలోనూ పలు చిత్రాలకు ఓకే చెప్పానని వెల్లడించిన రామ్.ఇప్పుడు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఈ బ్రేక్ పెద్దది కాదు చిన్నది మాత్రమేనని తాను మళ్లీ వస్తానని తెలిపారు.
దానికి గల కారణాన్ని కూడా రామ్ వివరించారు.ప్రస్తుతం రామ్ ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ తరుణంలో హీరో రామ్ శివ మాలను ధరించారు.దానికి సంబంధించిన ఫొటోను కూడా ఈ హీరో రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.కాగా సాధారణంగా శివుడి మాలను మండలంగా ధరించేవారు 41 రోజుల పాటు నియమ నిబంధనలు పాటిస్తూ స్వామిని ఆరాధించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో కొన్నింటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే రామ్ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఈ బ్రేక్ సినిమాలకా.? లేక సోషల్ మీడియాకా.? అన్నది తెలియడం లేదు .అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తరచుగా అయ్యప్ప స్వామి మాలను ధరిస్తుంటారు.ఆ సమయంలో నిబంధనలను పాటిస్తూనే షూటింగ్ల్లోనూ పాల్గొంటుంటారు రామ్ చరణ్.
కాగా ఇప్పుడు రామ్ అన్నింటికి దూరం ఉండబోతున్నట్లు తెలుస్తోంది మరి.