దర్శకుడు మారుతి సినిమాల పబ్లిసిటీ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటారు అనడంలో సందేహం లేదు.ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల మారుతికి గ్యాప్ వచ్చింది.
సినిమా మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని నిలిచి పోయాయి.దాంతో మారుతి సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్ట లేక పోయాడు.
ఇటీవలే మారుతి తన తదుపరి సినిమాను గోపీచంద్ హీరోగా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.సినిమా షూటింగ్ మొదలు అయ్యేది ఎప్పుడు ఏంటీ అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
హీరోయిన్ విషయమై బ్యానర్ ఏంటీ అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.అయినా కూడా మారుతి తన తదుపరి సినిమా విడుదల తేదీకి కర్ఫీఫ్ వేశాడు.
గోపీచంద్ కు జోడీగా హీరోయిన్ ఎవరు అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే సినిమా షూటింగ్ ను మారుతి ప్రారంభించ బోతున్నాడు.మారుతి దర్శకత్వం లో సినిమాలు అన్ని కూడా ఈ మద్య కాలంలో చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి.ప్రతి ఒక్క సినిమా ను ఆయన చాలా విభిన్నంగా షూట్ చేయడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉందని అభిమానులు అంటున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమయంలోనే బేనర్ లేదు, సినిమా పేరు లేదు, హీరోయిన్ లేదు, హీరో పిక్ కూడా లేదు, ఫస్ట్ లుక్ లేదు, ఫ్రీ లుక్ లేదు, ప్రొడ్యూసర్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు ఇలా ఏ విషయం క్లారిటీ లేదు.
అయినా కూడా అందరు విడుదల తేదీల విషయం లో క్లారిటీ ఇస్తున్న కారణంగా మేము కూడా విడుదల తేదీని ఇస్తున్నాం అంటూ అక్టోబర్ 1, 2021 న విడుదల చేస్తాం అంటున్నారు.