తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే ఠక్కున వినిపిస్తున్న పేరు అభిజిత్.ప్రస్తుతం పడుతున్న ఓట్లలో సగానికి పైగా ఆయనకే ఓట్లు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన అలీ రెజా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు.
అభిజిత్ కు సగం ఓట్లు వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం.ఓట్ల విషయం ఎవరికి తెలియదు.
ఆ విషయాన్ని ఎవరు కూడా బయటకు రివీల్ చేయరు.కనుక ఈ సమయంలో మీరు సోహెల్ కు ఓట్లు వేయండి.
సోహెల్ విజేత అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది అంటూ అలీ రెజా అన్నాడు.అలీ రెజా చేసిన వ్యాఖ్యలు కొందరు అభిజిత్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.
సోహెల్ కు అభిమానులు ఉన్నా కూడా గెలువడనే ఉద్దేశ్యంతో కొందరు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది.ఈ సమయంలో బిగ్ బాస్ సోహెల్ కు తప్పనిసరిగా ఓట్లు వేయాల్సిందిగా అలీ రెజా విజ్ఞప్తి చేశాడు.
సోహెల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.సోహెల్ కోసం అలీ రెజా కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నాడు.ఆమద్య సీజన్ 3 విన్నర్ రాహుల్ కూడా ఇండైరెక్ట్ గా సోహెల్ కు ఓట్లు వేయాల్సిందిగా కోరారు.పోరాడే తత్వం ఉండటంతో పాటు మనలో ఒకడిగా కనిపించే సోహెల్ ను సమర్థించి విజయం సాధించేలా ఓట్లు వేయాలంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.
ఈసమయంలో అభిజిత్ కు ఓట్లు పడుతున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని వారితో సోహెల్ కు ఓట్లు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈసమయంలో బిగ్ బాస్ విజేత విషయంలో మళ్లీ చర్చ జరుగుతోంది.
అభిజిత్ అభిమానులు చేస్తున్న ప్రచారమేనా ఓట్లు అనేది మళ్లీ రచ్చ అవుతుంది.