పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.
దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు.దాంతో పాటు వచ్చే ఏడాది మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.
అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నారు.అయ్యప్పన్ రీమేక్ సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.
ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తుందని టాక్ నడుస్తుంది.మరో హీరోగా రానా పేరు వినిపిస్తున్న ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది.
![Telugu Pawan Kalyan, Rana Daggubati, Sagar Chandra, Telugu, Thaman Ss, Tollywood Telugu Pawan Kalyan, Rana Daggubati, Sagar Chandra, Telugu, Thaman Ss, Tollywood](https://telugustop.com/wp-content/uploads/2020/11/Rana-Gives-Clarity-on-Ayyappanum-Koshiyum-Remake.jpg)
పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి జానీ సినిమా కోసం గొంతు సరి చేసుకొని పాట పాడారు.అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న బిట్ సాంగ్స్ పడుతూ ఉంటారు.ఖుషి సినిమాకి కూడా కామెడీగా వచ్చే బిట్స్ పాడుతున్నారు.
ఇప్పుడు ఒక పూర్తి స్థాయిలో సాంగ్ ని పవన్ కళ్యాణ్ తో పాడించాలని థమన్ అనుకుంటున్నారు.అయ్యప్పన్ కోషియమ్ ఒరిజినల్ వెర్షన్ ప్రమోషన్ కోసం ఓ సాంగ్ ని పృథ్వీరాజ్, బిజూ మీనన్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడారు.
తెలుగులో కూడా ఇలాంటి పాటను పెట్టడం కోసం సంగీత దర్శకుడు థమన్ ఓ పవర్ ఫుల్ ట్యూన్ ను రెడీ చేస్తున్నాడట.ఈ ప్రోమో సాంగును పవన్, రానాల చేత పాడించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.