టాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ సంపాదించిన ఫేం మామూలుది కాదు.ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్గా అవతరించాడు.
ఈ సినిమా మొదలుకొని మనోడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇక తరువాత చేసిన గీతగోవిందం సినిమా కూడా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు.
అయితే మనోడు తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయడం చేస్తూ తెరకెక్కించిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమా శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు మంచి హైప్ ఉన్నా సినిమాలో అనుకున్నంత స్థాయిలో కంటెంట్ లేకపోవడంతో సినిమాకు కేవలం కొంత మంది మాత్రమే కనెక్ట్ అవుతున్నారు.
దీంతో ఈ సినిమాతో దేవరకొండకు నష్టాలు తప్పవని అంటున్నారు.
సినిమాకు కొన్ని చోట్ల మాత్రమే సూపర్ హిట్ టాక్ రావడంతో హీరోగా మారిన తరుణ్ భాస్కర్కు జ్ఞానోదయం అయ్యింది.
ఇకపై తనకు వచ్చిన డైరెక్షన్ తప్పితే ఇంకోదాంట్లో వేలు పెట్టనని శపథం కాశాడు.దీంతో అతడి తీరు ఏం బాగాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.