బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ అంటే ‘ బంధిపోట్ల రాష్ట్ర సమితి’ అని ఊరికే అనలేదన్నారు.
నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి రక్తమోడేలా దాడి చేసి, చంపేస్తానని బెదిరించడం బంధిపోట్లకే సాధ్యమని ఆరోపించారు.దళితబంధు అక్రమాలను ఎత్తి చూపిన అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్ గూండాల దాడిని వైఎస్ఆర్ టీపీ ఖండిస్తుందని తెలిపారు.
దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అన్నీ రకాలుగా కేసీఆర్ మోసం చేశారని ఆరోపణ చేశారు.