YS Sharmila Sajjala Ramakrishna Reddy : సజ్జల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి మొదటి నుండి వైకాపా వ్యతిరేకంగా పోరాటం చేసిందని సజ్జల  రామకృష్ణ రెడ్డి తెలపడం తెలిసిందే.ఇదే సమయంలో కుదిరితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడిగా కలిసి ఉండాలన్నది వైకాపా విధానమని ఆయన వ్యాఖ్యానించారు.

 Ys Sharmila Counter To Sajjala Ramakrishna Reddy Comments , Ys Sharmila, Sajjala-TeluguStop.com

అందుకు సంబంధించి ఎటువంటి అవకాశం దొరికిన మళ్లీ కలిపేందుకు తమ పార్టీ ఓటు వేస్తుందని కూడా తెలియజేశారు.దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.

“సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి.

నేడు తెలంగాణ ఒక వాస్తవం.ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ.

రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం.కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి.

విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు?మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద.మీ హక్కుల కోసం పోరాటం చేయండి; మీ ప్రాంతానికి న్యాయం చేయండి.అంతేకాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు.” అని తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube