ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడ్డాయని సీఎం జగన్ అన్నారు.ఈ క్రమంలో అధికారులు సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
పరిహారం అందించడం పట్ల అధికారులు సానుభూతితో ఉండాలని చెప్పారు.రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని తెలిపారు.
అలాగే పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ నేపథ్యంలోనే రైతులు అధైర్య పడొద్దన్న సీఎం జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని స్పష్టం చేశారు.