ప్రేమ పావురాలు భాగ్యశ్రీ సినిమాల్లోకి ఎలా వచ్చిందో…ఆ సినిమా తర్వాత ఎందుకు నటించలేదో తెలుసా.?

కబూతర్ జా…జా…జా….కబూతర్ జా…జా.

 Unknown Facts About Prema Pavuralu Actress Bhagyashree-TeluguStop.com

అంటూ హిందీలో పాడినా,ఓ పావురమా అంటూ తెలుగులో పాడుకున్నా కుర్రకారు ఫిదా అయ్యారు.నీ జతలేక పిచ్చిదికాదా మనసంటా అంటూ ఆమె పాడిన పాటకి రాత్రికి రాత్రే ఫ్యాన్స్ పెరిగిపోయారు.

ఆమే భాగ్యశ్రీ.ఇప్పుడు అంటే సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు కాని ఇవేవి లేని కాలంలోనే భాగ్యశ్రీ ఒన్ డే లోనే స్టార్ అయిపోయింది.

అది కూడా ప్రేమ పావురాలు సినిమాతో… అసలు ఆ సినిమా అవకాశం ఆమెకి రావడం ఎలాంటి పరిస్థితిల్లో జరిగిందో తెలుసా.ఇప్పుడు తన కొడుకు కోసం ఏం చేస్తుందో తెలుసా.

మైనే ప్యార్ కియా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.అందులో నటించిన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీలు స్టార్ హీరో హీరోయిన్ల హోదాను సొంతం చేసుకున్నారు.పరిచయం అయిన తొలిచిత్రం తోనే భాగ్య శ్రీ ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నది.మొత్తానికి అటు హిందీలో, ఇటు తెలుగులో ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దేశం మొత్తం భాగ్య శ్రీ పేరు మోగిపోయింది.

అసలు విషయం ఏమిటంటే భాగ్య శ్రీ,ఆమె భర్త హిమాలయ దాసాని చిన్న నాటి దోస్తులు.వారిద్దరూ ప్రేమించుకున్నారు.ప్రేమ పావురాలు సినిమా చేయడానికి కొద్ది రోజుల ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఇద్దరి కుటుంబాల్లోనూ విషయం చెప్తే దాసాని ఇంట్లో అంగీకరించినా,భాగ్యశ్రీ ఇంట్లో మాత్రం యాక్సెప్ట్ చేయలేదు.

అయినా సరే పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో భాగ్యశ్రీ ఉంది.ఈ క్రమంలోనే హిమాలయ దాసాని ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు.

ఆమెకు తెలిసిన వారి ద్వారా ఓ సినిమాలో ఛాన్స్ ఉంది చేస్తావా? అంటూ అవకాశం తలుపుతట్టింది.కాని అప్పటికే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది కదా! అందుకని సినిమాలో చేయడానికి అంగీకారం కోసం దాసాని తల్లిదండ్రులని అడిగింది.

వారు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు.అలా ఆమె తెరంగ్రేటం చేసింది.

సినిమా అయిపోయే టైంలోనే హిమాలయ్ దాసాని అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు.పెళ్లికి మాత్రం భాగ్య శ్రీ తల్లిదండ్రులు అప్పటి మాటమీదే ఉన్నారు.దీంతో వారిని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత విడుదలైన ప్రేమ పావురాలు, మైనే ప్యార్ కియా (హిందీ వెర్షన్) సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.

కాని ఆమె మాత్రం వాటన్నింటినీ తిరస్కరించింది.భాగ్య శ్రీ వివాహం అనంతరం తెలుగులో బాలకృష్ణ చెల్లెలుగా రాణా సినిమాలో నటించింది.అనంతరం తన ప్రియుడు హిమాలయ్ దాసానీ తో కలిసి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.ఈ దంపతులు సృష్టి ఎంటర్ టైన్మెంట్ మీడియా కంపెనీని నిర్వహిస్తున్నారు.

భాగ్య శ్రీ కుమార్తె లండన్ లో చదువుకుంటుండగా… కుమారుడు అభిమన్యు వెండి తెరపై అడుగు పెట్టే అవకాశాల కోసం చూస్తున్నాడు.బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

ఆమె కూడా తన కొడుకును ఎలాగైనా బాలీవుడ్ లో సెటిల్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది…తనకెన్ని అవకాశాలొచ్చినా వద్దనుకుంది కాని.ఇప్పుడు తన కొడుకుకి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube