మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను రెడీ చేస్తున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా మొదట త్రిషను ఎంపిక చేశారు.
అయితే ఈ సినిమా నుండి ఆమె వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో తాజాగా కాజల్ అగర్వాల్ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయితే త్రిష మాత్రం తనకు ఈ చిత్ర యూనిట్తో కొన్ని మనస్పర్థలు రావడంతోనే ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను వదులుకున్న త్రిష తన నెక్ట్స్ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మాస్ రాజా రవితేజ నటించనున్న ఓ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను రాక్షసుడు చిత్ర దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు రవితేజ ఓకే చేయగా తాజాగా త్రిష కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.మొత్తానికి చిరు సినిమాకు నై చెప్పి, రవితేజ సినిమాకు సై చెప్పడంతో త్రిషపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.