బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతోంది.
భారత జాగృతి నేతృత్వంలో సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరగనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 3ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు.
మహిళా దినోత్సవం( International Women’s Day ) రోజు ధర్నా చేయడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.జీవో నంబర్ 3 వలన ఏళ్ల తరబడి ఉన్న అవకాశాలు పోయాయని వెల్లడించారు.అదేవిధంగా ఈ జీవో ద్వారా గురుకులాలకు అన్యాయం జరిగిందన్నారు.ఓటుకు నోటు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జాబులపై లేదా అని కవిత ప్రశ్నించారు.ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 3 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.