ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ ప్రభుత్వం బుధవారం ఘనంగా నిర్వహించింది. ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రి రోజా గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.
దీని కోసం జనాలను వినోదాన్ని, మీడియా పోకస్ అవ్వడం కోసం జబర్దస్త్పి టీంను ఈ వెడుకల్లో భాగం చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించగా జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, హాస్యనటులు హైపర్ ఆది, చలాకీ చంటి, రోహిణి, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వేదికపై జానపద బృందం ప్రదర్శన ఇస్తుండగా, యాంకర్ అనసూయ, మంత్రి రోజా వారితో కలిసి వచ్చారు. అనసూయ, రోజా వారితో కాళ్లు ఊపుతూ వీక్షకులను అలరించారు.
సీఎం జగన్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నియమితులైన టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు అలీ ఈ కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అతను హాస్యనటులు మహేష్, రామ్ ప్రసాద్లతో కలిసి వేదికపై ప్రదర్శన ఇచ్చాడు.జగన్ సాంస్కృతిక సంబరాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వీర అభిమాని, మద్దతుదారు అయిన హైపర్ ఆదిని చూడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.అయితే ఈ వేడుకలకు కర్త, కర్మ క్రియ అంతా రోజానే.
మంత్రి పదవి వరించిన తర్వాత జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చారు.అయినప్పటికి ఆ షో నటులతో పరిచయాలు కొనసాగిస్తున్నారు.
అయితే ఈ షో నటులను తను రాజకీయంగా ఉపయోగించుకకోవాలని రోజా చూస్తుంది.వచ్చే ఎన్నికల్లో నగరి ప్రచారం లో కూడా వీరిని ఉపయోగించుకోవాలని రోజా చూస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ వేడకల్లో వచ్చిన స్పందన చూసిన రోజా తన నియోజకవర్గంలో నిర్వహించే వివిధ సభల్లో కూడా పాల్గోనేలా ఏర్పాట్లు చేసుకుంటుంది.