మామూలుగా సినిమా పరిశ్రమ అంటే రంగుల పరిశ్రమ అని ఇక్కడ మనసుతో పాటు ముఖానికి వేసుకునేటువంటి రంగులు చాలా ముఖ్యమని అప్పట్లో ఓ మహానుభావుడు చెప్పాడు.అయితే ఈ సినిమా పరిశ్రమని ఎంతో మంది కష్ట పడి పనిచేసి అభివృద్ధి చేశారు.
అప్పట్లో మద్రాసులో ఉన్నటువంటి చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కి తరలించడానికి కృషి చేసినటువంటి వారిలో ప్రముఖ స్వర్గీయ నటుడు మరియు సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.అక్కినేని నాగేశ్వరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలు మరువలేనివి.
అయితే తాజాగా అక్కినేని నాగేశ్వరరావు (బ్రతికి ఉన్నప్పుడు) అప్పట్లో పాల్గొన్నటువంటి ఓ ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న సమయంలో ఎదుర్కున్న అనుభవాల గురించి చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో అక్కినేని నాగేశ్వర రావు ఉదయం సమయంలో షూటింగ్ జరిగే టప్పుడు కొందరు హీరోయిన్లు కనీసం పళ్ళు కూడా తోముకోకుండా కేవలం మేకప్ వేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేవారని చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో వారితో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా కంపరంగా ఉండేదని తెలిపాడు.దీంతో ఒక్కోసారి అలాంటి హీరోయిన్ల అసిస్టెంట్లను పిలిచి మరి సినిమా షూటింగ్ లో పాల్గొనేటప్పుడు శుభ్రంగా ఉండమని చెప్పండని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని తెలిపాడు.
అలాగే పని ఏదైనా సరే పరిశుభ్రత, క్రమశిక్షణ, ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా అక్కినేని నాగేశ్వర రావు అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు.
అంతేగాక తన తుది శ్వాస విడిచే వరకు కూడా నటన కోసం ఎంతో కృషి చేశాడు. కాగా చివరగా తెలుగులో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన “మనం” అనే చిత్రంలో నటించాడు.
చివరికి 2013వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున క్యాన్సర్ కారణంగా కన్ను మూసాడు.