బుల్లితెర స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటూనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ మహేశ్వరి అతిథిగా వచ్చారు.
ఈమెను సాదరంగా ఆహ్వానించిన సుదీర్ ఆమె రాగానే ఆమెతో చేయి కలపడానికి ప్రయత్నం చేశారు.దీంతో ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పింది.
అప్పుడు సుదీర్ అదేంటి నేను హలో అంటే మీరు నమస్తే అన్నారని సుదీర్ అనడంతో వెంటనే మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు.అంటూ సుధీర్ గాలి తీసింది.
దీంతో ఒక్కసారిగా అందరు గట్టిగా నవ్వారు.
ఇక అనంతరం సుధీర్ మాట్లాడుతూ మేడం నన్ను ఎక్కడ ఉండమంటారు? అని అడగగా వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా ఉండు అంటూ వేదికపైనే సుధీర్ ను అవమానపరిచింది.ఇలా సుధీర్ పై మహేశ్వరి వేసిన పంచ్ కు అక్కడున్నవారంతా కడుపుబ్బ నవ్వారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి వినోదం చూడాలంటే ఆదివారం వరకు వేచి ఉండాలి.