ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.ఈ మేరకు జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాస్ రెడ్డి( Kandhi Srinivas Reddy ) వర్గీయులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
నిన్నటి నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు నిరసనల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.రెబల్స్ సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలో చేర్చుకోవడంతో వివాదం మొదలైందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం రెబల్స్ నేతల సస్పెన్షన్ ఆరేళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసేందుకు కంది వర్గీయులు సిద్ధం అయ్యారు.అదేవిధంగా నేటి నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భార్గవ్ దేశ్ పాండే, సాజిద్ ఖాన్, సుజాత మరియు సంజీవ్ రెడ్డిలపై పార్టీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఘర్ వాపసిలో భాగంగా నిన్న నలుగురు నేతలను పార్టీలో తిరిగి చేర్చుకుంది.