ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు..!!

ఆదిలాబాద్ జిల్లా( Adilabad District ) కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.ఈ మేరకు జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాస్ రెడ్డి( Kandhi Srinivas Reddy ) వర్గీయులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Protest Flames In Adilabad District Congress Details, Kandhi Srinivas Reddy , Ad-TeluguStop.com

నిన్నటి నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు నిరసనల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.రెబల్స్ సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీలో చేర్చుకోవడంతో వివాదం మొదలైందన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వారిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం రెబల్స్ నేతల సస్పెన్షన్ ఆరేళ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసేందుకు కంది వర్గీయులు సిద్ధం అయ్యారు.అదేవిధంగా నేటి నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భార్గవ్ దేశ్ పాండే, సాజిద్ ఖాన్, సుజాత మరియు సంజీవ్ రెడ్డిలపై పార్టీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

అయితే ఘర్ వాపసిలో భాగంగా నిన్న నలుగురు నేతలను పార్టీలో తిరిగి చేర్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube