తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్( BJP MP Dr.
Laxman ) ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ నేతలు బీజేపీపై( BJP ) బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దిగజారారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు ఎంఐఎం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.అంతేకాకుండా బీసీల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎస్టీ, ఎస్సీ, బీసీలకు మోదీ న్యాయం చేస్తారని తెలిపారు.







