బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్( BRS leader Krishank ) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు పంతంగి చెక్ పోస్ట్ వద్ద ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసినట్లు క్రిశాంక్ పై ఆరోపణలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఆయనపై కాంగ్రెస్ నేతలు( Congress leaders ) ఓయూ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
కరెంట్ మరియు నీటి కొరత కారణంగా హాస్టల్స్ ను మూసివేస్తున్నట్లు వీసీ పేరుతో సర్క్యులర్ జారీ అయింది.అయితే ఈ సర్క్యులర్ ను పోలీసులు ఫేక్ అని నిర్ధారించారు.
ఈ క్రమంలో ఫేక్ సర్క్యులర్ వెనుక క్రిశాంక్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.కాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే సర్క్యులర్ రూపొందించినట్లు క్రిశాంక్ పై ఆరోపణలు వస్తున్నాయని సమాచారం.