తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్( Vikas Raj ) కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని పొడిగించే అంశంపై సీఈసీకి నివేదించామని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
పోలింగ్ సమయం పెంపుపై సీఈసీ( CEC ) నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
కాగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.అలాగే ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారన్న సంగతి తెలిసిందే.