విశాఖలోని పాయకరావుపేటలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం కాబట్టే తనపై చంద్రబాబు( Chandrababu ) కక్షగట్టారని సీఎం జగన్ అన్నారు.
అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ విప్లవం కాదా అని సీఎం జగన్ పేర్కొన్నారు.అమ్మఒడి పథకం( Ammavodi ) గతంలో ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విప్లవం కాదా అని ప్రశ్నించారు.
మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించే పథకాలు విప్లవం కాదా అన్నారు.
ఆరోగ్య శ్రీ( Aarogya Sri ) పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.లంచాలు లేకుండా గతంలో ఏనాడైనా పథకాలు అందాయా అని అడిగారు.
ఇవన్నీ వైసీపీ పాలనలో విప్లవాలు అవునా ? కాదా? అనేది ఆలోచన చేయాలన్నారు.భూములపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న సీఎం జగన్ మీ భూములపై మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) అని చెప్పారు.
తాను ఎలాంటి వాడినో ప్రజలకు తెలుసన్నారు.తాను భూములు ఇచ్చేవాడినే కానీ కాజేసే వాడిని కాదని తెలిపారు.