కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Home Minister Amit Shah ) సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.ఇందులో భాగంగా ఆయన పాతబస్తీలో బీజేపీ( BJP ) తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
బీజేపీ అభ్యర్థి మాధవీలతకు( Madhavilatha ) మద్ధతుగా అమిత్ షా ప్రచారాన్ని చేపట్టనున్నారు.కాగా ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆయన రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఈ మేరకు లాల్ దర్వాజలో ప్రారంభం కానున్న అమిత్ షా రోడ్ షో నెహ్రూ విగ్రహం మీదుగా సుధా టాకీస్ వరకు కొనసాగనుంది.రోడ్ షో ముగిసిన అనంతరం రాష్ట్ర బీజేపీ( BJP ) ముఖ్యనేతలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా పని చేసే విధంగా నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.అయితే తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే.
.