సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహమ్మారి కరోనా చైనా నుండి ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన టైం లో.
ఇండియాలో లాక్ డౌన్ అమలు చేసిన నాటి నుండి.సోను సూద్ వలసకూలీ లకు ఇంకా అనేక వర్గాల ప్రజలకు అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత దేశంలో ఏర్పడిన టైంలో చాలా చోట్ల ఆక్సిజన్ సిలిండర్లు అందించడం మాత్రమే కాక కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రీతిగా ప్రాణాలను కాపాడటం మరికొంత మందికి ఉద్యోగాలు ఇస్తూ పేద కుటుంబాలలో ఉన్న విద్యార్థులకు చదువులు విషయంలో అనేక రకాలుగా సహాయపడుతూ ఉన్నారు.
అన్ని సహాయాలు చేస్తూ దేశవ్యాప్తంగా అందరిచేత మన్ననలు పొందుకుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు సోను సూద్.ఇదిలా ఉంటే విద్యార్థుల కోసందేశ్ కి మెంటర్స్అనే వినూత్న కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టనున్నారు.
పేద విద్యార్థుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి.సోనూసూద్ ని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు.
ఈ విషయాన్ని తాజాగా కేజ్రీవాల్ వెల్లడించారు.ఈ క్రమంలో సోనీ షోరూం మంచి కార్యక్రమంలో ఢిల్లీ ప్రభుత్వం తన ని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశవ్యాప్తంగా చేస్తున్న అనేక సహాయ కార్యక్రమాలలో చదువు ఉపయోగం అంటే ఏంటో ఇటీవల అర్థమైందని సోను సూద్ తెలిపారు.