సాధారణంగా మనలో చాలా మంది రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ వుంటారు.అయితే అవే వారి జీవితానికి శాపంలాగా మారుతూ ఉంటాయి.
ట్రైన్ రన్నింగులో ఉండగానే క్యాచ్ చేయడానికి అనేక స్టంట్ లు వేస్తుంటారు.కానీ అదే కాస్త అరగంట ముందు స్టేషన్ కు వెళ్తే ఎంతో ప్రశాంతంగా రైలు ఎక్కొచ్చు అనే చిన్న విషయాన్ని వారు పక్కన బెడతారు.
ఇలాంటి కొన్ని సందర్భాలో అనుకొని ప్రమాదాలు సంభవిస్తుంటారు.కొన్నిసార్లు.
రైలు ఎక్కుతుండగా కాలుజారి కిందపడి ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకం చూస్తూ ఉంటాం.
ఈ క్రమంలోనే మరో షాకింగ్ ఇన్సుడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన తాజాగా సంచలనం సృష్టించింది.భర్తనా రైల్వే స్టేషన్లో ఈరోజు తెల్లవారుజామున స్టేషన్ ప్లాట్ఫారమ్, రైల్వే ట్రాక్ల మధ్య పొరపాటున పొరపాటున పడి ఒక ప్రయాణికుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.
రైళ్ల కింద నలిగి తప్పించుకున్న వ్యక్తి వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఆ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గ్యాప్ మధ్య పడిపోయాడు.
అయితే అతడు సన్నగా ఉండటం కారణంగా, వెంటనే ఒకవైపు పడుకొని, తనను తాను రక్షించుకోగలిగాడు.ఈ ఘటన అక్కడ ఉన్న CC కెమెరాలో రికార్డు అయ్యింది.
అయితే అక్కడ ప్లేట్ ఫామ్ మీద వున్నవారు అతడు ఏమయ్యాడు అని ఆతృతగా చూడటం మనం చూడవచ్చును.రైలు స్టేషన్ దాటగానే, అతను వెంటనే లేచి నిలబడి చేతులు ముడుచుకున్నాడు.
ఈ సంఘటన ఈరోజు ఉదయం 9:45 గంటలకు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ 2 వద్ద జరిగినట్టు సమాచారం.