కెరీర్ ఆరంభంలో మంచి కథలను ఎంపిక చేసుకొని సినిమాల్లో నటిస్తాడు అంటూ పేరు దక్కించుకున్న యంగ్ హీరో శర్వానంద్.ఈయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కొన్ని కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోలేక పోయినా కూడా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.హీరోగా నటుడిగా ఎంతో మంచి పేరు దక్కించుకున్న శర్వానంద్ ఇప్పుడు కెరీర్ పరంగా కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తుంది.
గత కొంత కాలంగా ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూనే ఉంది.జాను సినిమా కమర్షియల్ గా పరవాలేదు అనిపించినా కూడా ఆ సక్సెస్ క్రెడిట్ అంతా సమంత ఖాతాలోనే పడింది.
ఆ తర్వాత ఈయన నటించిన శ్రీకారం మరియు మహా సముద్రం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.శ్రీకారం సినిమా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అంటూ అంతా భావించారు.
వ్యవసాయ నేపథ్యంలో సినిమా తీశారు.ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
కానీ ఈ సినిమా కమర్షియల్గా మాత్రం దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవలసి వచ్చింది.తాజాగా ఆయన నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా నెగిటివ్ టాక్ ను దక్కించుకుంది.దాంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు నటుడిగా మంచి పేరు తీసుకు వచ్చే కథలు ఎంపిక చేసుకొని నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలాంటి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.తాజాగా ఒక అభిమాని శర్వానంద్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.ఇలాంటి సినిమాలు తీయడం వల్ల అభిమానులకు తీరని అన్యాయం చేస్తున్నారు.అన్నా మీరు ఇప్పటికైనా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ట్వీట్ చేశాడు.ప్రస్తుతం శర్వానంద్ అభిమానులు ఆ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.