నవంబర్లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హారిస్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ ప్రక్రియలో ఆమె కీలక ఘట్టం పూర్తి చేశారు.
డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆమె స్వీకరించారు.డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ల సమక్షంలో కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నామినేట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మన విషాదాలను, బాధలను రాజకీయ ఆయుధాలుగా మలచుకున్న ట్రంప్ను ఓడించాలని కమల పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో జో బిడెన్ను గెలిపించాలని ఆమె కోరారు.బిడెన్ దేశాధ్యక్షుడైతే, దేశ ప్రజలందరినీ ఆయన ఒక్క తాటిపైకి తీసుకొస్తారని కమలా ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ నాయకత్వ వైఫల్యం.ప్రజల ప్రాణాలను, జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసిందని ఆమె మండిపడ్డారు.
తన తల్లి నేర్పిన విలువలకు, బిడెన్ విజన్కు కట్టుబడి ఉంటానని కమలా హారిస్ ట్వీట్ చేశారు.
ఇదే సమావేశంలో ఒబామా మాట్లాడుతూ… శ్వేత సౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియస్గా చేస్తారని భావించామని, కానీ ఆయన పాలన నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఒబామా ఆరోపించారు.ట్రంప్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రతిష్టకు భంగం కలగిందని, మన ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా జో బిడెన్ను డెమొక్రాట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.77 ఏళ్ల జో బిడెన్ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్తో తలపడతారు.