పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి... సీనియర్ లు సహకరిస్తారా?

తాజాగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా రాణించలేకపోయింది.దుబ్బాకలో జోరుగా ప్రచారం చేసినా, అదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైభవం కొంత దెబ్బతిందని చెప్పవచ్చు.

 Rewanth Reddy Who Started The Padayatra Will The Seniors Cooperate ,congress, Re-TeluguStop.com

ఇప్పటివరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కాస్తా మూడో స్థానానికి పడిపోయింది.ఇప్పుడు కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్రను చేపట్టారు.

కాని మనం ముఖ్యంగా గమనించవలసినది ఏమనగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ, కాంగ్రెస్ లో ఎవరైనా ఎదగాలంటే చాలా సమీకరణాలు ఉంటాయి.ఇలాంటి వాతావరణంలో రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేది అయినా సీనియర్లు సహకరించకపోతే ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పట్ల ఐకమత్యం ఉంది అనేది ప్రజలకు కనిపించదు.

ఇప్పటివరకు పాదయాత్రలు చేపట్టిన వారు సీఎంలుగా అయిన చరిత్ర ఉంది.ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ నుండి ఒక మంచి ముందడుగు అని చెప్పవచ్చు.అందరూ సీనియర్ లు కలిసి రాకపోతే రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుకున్నంతగా ఆదరణ రాకపోవచ్చు.చూద్దాం మరి రేవంత్ రెడ్డి పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంతమేర ప్రభావం చూపిస్తుందనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube