యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.విపరీతమైన అంచనాలున్న ప్రభాస్ సినిమాలు వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా ఏకంగా మూడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేస్తూ ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ అన్నట్లుగా నిలుస్తాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.రాధే శ్యామ్.
సలార్ మరియు ఆదిపురుష్ లు 2022 లో విడుదల అవ్వడం ఖాయం.ఇక ప్రాజెక్ట్ కే తో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు.
ప్రభాస్ 25వ సినిమాగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా వచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ వంగ దర్శకత్వంలో సినిమా తో పాటు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా సినిమా ఉండాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా హిందీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రభాస్ మరియు సిద్దార్థ్ ఆనంద్ ల కాంబోలో సినిమా కావాలని ఆశ పడుతున్నారు.
రికార్డు స్థాయిలో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు.ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తే తప్పకుండా మంచి స్టార్ డమ్ ను ఉత్తరాదిన ప్రభాస్ దక్కించుకుంటాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి.సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో ప్రభాస్ సినిమా ను వచ్చే ఏడాదిలో అయినా ప్రకటించాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.