పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యి తన స్పీచ్ లో చాలా విషయాల గురించి మాత్రదిన విషయం తెలిసిందే.పవన్ చేసిన అన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతున్నాయి.
ఆయన చేసిన కామెంట్స్ పై కౌంటర్ లు కూడా వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు వివాదంగా మారుతున్నాయి.
పవన్ చేసిన కామెంట్స్ పై తాజాగా పోసాని మురళి కూడా స్పదించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రెసెంట్ హాట్ టాపిక్ అయ్యాయి.అందులో భాగంగా పవన్ రెమ్యునరేషన్ పై కూడా పోసాని రియాక్ట్ అయ్యాడు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ మీరు ప్రతి సినిమాకు కేవలం 10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారు అని తెలిపారు.
ప్రజలందరూ మూర్ఖులు అని మీరు అనుకుంటున్నారా.మీరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ప్రజలకు తెలియదు అని అనుకుంటున్నారా అని సూటిగా ప్రశ్నించారు.
మీరు ప్రతి సినిమాకు దాదాపు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు.ఇది కనుక తప్పు అని నిరూపిస్తే నేను మీతో చెప్పు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పోసాని హాట్ వ్యాఖ్యలు చేసారు.
మీరు నిజంగా సినిమాకు 10 కోట్లు తీసుకుంటే నేను ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయకు ఇచ్చి మరి మీతో సినిమా తీస్తా.నాకు మీరు నాలుగు ప్రాజెక్ట్స్ పై సంతకం చేస్తారా.అని ప్రశ్నించారు.పవన్ సినిమాల టికెట్స్ 500 నుండి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు.ఇది మధ్య తరగతి ప్రజలను దోచుకోవడం కాదా.మీరు మీ సోదరుడు చిరంజీవి నుండి చాలా నేర్చుకోవాలి అంటూ పోసాని పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు.
చూడాలి మరి ఈ వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయో.