టాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించిన హీరోయిన్లలో ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఒకరు.తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి అల వైకుంఠపురములో అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన టువంటి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అంతేకాక పలు రికార్డులను బద్దలు కొట్టి ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా ఓ అభిమాని మీరు సాంప్రదాయ దుస్తులు అయినటువంటి చీరలో చాలా అందంగా కనిపిస్తారని చక్కగా చీర కట్టుకోవచ్చు కదా అని ఓ అభిమాని అడిగాడు.దీంతో పూజా హెగ్డే సమాధానమిస్తూ అవును చీరలో ప్రతి ఒక్క మహిళా కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుందని, కానీ తనకు మాత్రం చీరలు అంటే భయమని అంటోంది ఈ అమ్మడు.
అంతేగాక తను చిన్నప్పుడు సంప్రదాయ పోటీలకు చీర కట్టుకొని హాజరయ్యే దాన్ని అని కానీ ఎక్కడ చీర కొంగు జారి పోతుందో అని భయపడుతూ ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది.అయితే తన ఇంట్లో జరిగేటువంటి వేడుకలకు, పూజలకు తప్ప మరి ఏ సమయంలోనూ చీర కట్టుకొని ఎందుకంటే చీరలో తన చూడడానికి బాగున్నప్పటికీ హ్యాండిల్ చేయడం రాదని సరదాగా చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
అయితే ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నడుస్తున్నటువంటి జాన్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.కే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.అంతేగాక తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.