కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాద్ నగరంలో కొత్తపేటలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డుపైన టిఆర్ఎస్ పార్టీ జెండాను చించేసి నిరసన తెలియజేశారు టీ కాంగ్రెస్ నేతలు.తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా రేవంత్ రెడ్డి కొత్తపేట లో ఆందోళనకు దిగారు.
రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైవేని దిగ్బంధించారు.ఈ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అదే విధంగా మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శల వర్షం కురిపించారు.ఆ సమయంలో కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ వెళుతున్న తరుణంలో అదే నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఎంపీ గా ఉండటం తో ప్రోటోకాల్ పాటించడం కూడా టిఆర్ఎస్ మినిస్టర్ కి తెలియదా అంటూ టీ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించాయి.ఏది ఏమైనా ఆందోళనలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో కొత్తపేట ప్రాంతం వద్ద కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.