అప్పుడే ఎన్నికల వాతావరణం ఏపీలో వచ్చేసినట్లే కనిపిస్తుంది.అన్ని రాజకీయ పార్టీలు ఈ మేరకు హడావుడి చేస్తున్నాయి.
జనాల్లోకి వస్తూ తమ పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటిని పలకరించే విధంగా రాజకీయ పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలోని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ హిట్ ను మరింత పెంచే ఆలోచనలో ఉన్నారు.టిడిపి ఏపీ అధికార పార్టీ వైసిపి ఇప్పటికే జనాల్లో తిరగడం మొదలు పెట్టాయి.
గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసిపి జనాల్లోకి వెళ్తుండగా, నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల యాత్రను చేపట్టారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టాలని చూస్తున్నారట.ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి అనే హడావుడినడుస్తోంది .2023 మార్చిలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పవన్ అనుమానిస్తున్నారు.ఈ మేరకు ఆయనకు కేంద్రంలోని కొంతమంది కీలక నాయకుల ద్వారా సమాచారం అందడంతోనే ఇప్పుడు హడావుడిగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకోవడానికి కారణంగా తెలుస్తోంది.
గతంతో పోలిస్తే జనసేన బాగా యాక్టివ్ అయ్యింది.ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తోంది.దీనిలో భాగంగానే పవన్ ఇప్పుడు ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో జనంలోకి వచ్చేందుకు ఈ బస్సు యాత్రను వాడు కాబోతున్నారట.ఏపీలో ముందస్తు ఎన్నికల విషయమై ఇప్పటికే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.
వచ్చే ఏడాది మార్చిలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు.అయితే ఇదంతా పక్కా సమాచారంతోనే జనసేన అలర్ట్ అవుతున్నట్లుగా అర్థమవుతోంది.