తెలుగు బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు క్యారెక్టర్ లో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నాడు.అయితే నిరుపమ్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి రైటర్ కూడా.
అతని తండ్రి పాపులర్ రచయిత కావడంతో అప్పుడప్పుడు ఆ కవితా కలబోతలు నిరుపమ్ కలం నుంచి కూడా జాలువారుతుంటాయి.
ఇకపోతే ఇదిలా ఉంటే కార్తీకదీపం సీరియల్ నుంచి వెళ్లి పోయినా కూడా ఫేస్ బుక్,యూట్యూబ్ ఛానల్ లలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువగా ఉంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కు పూర్తిగా గ్యాప్ ఇచ్చారు డాక్టర్ బాబు.డాక్టర్ బాబు సోషల్ మీడియా లో ఎటువంటి పోస్టులు పెట్టకపోవడంతో డాక్టర్ బాబు ఏమైపోయారు అంటూ స్పందనలు వినిపిస్తూ ఉండగా.
ఆ విషయంపై స్పందించిన నిరుపమ్ ఆకలి లేక తిండి తినలేదు.నిద్ర పట్టక కునుకు తీయలేదు.ఫొటోలు లేక పోస్ట్లు పెట్టలేదు.క్యాప్షన్ దొరక్క ఇదంతా చెప్పడం లేదు.
ఇప్పుడు లైక్ కొట్టకుండా నిన్ను ఎవరూ ఆపట్లేదు అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేశారు.
లైక్ కొట్టకుండా నిన్ను ఎవరూ ఆపలేరు అని తన ఫ్యాన్స్ని రెచ్చగొట్టడంతో డాక్టర్ బాబు ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి ఆ పోస్ట్ పై లైక్ల మోత మోగిస్తున్నారు.ఇదిలా ఉంటే.కార్తీకదీపం సీరియల్ తరువాత నిరుపమ్ బుల్లితెర పై కనిపించడమే మానేశారు.
అతనితో పాటు వంటలక్క కూడా కార్తీకదీపం నుంచి మాయం కావడంతో ఆ సీరియల్ వెనుక నడక ప్రారంభించింది.ఒకప్పుడు జాతీయ స్థాయిలో రికార్డ్ టీఆర్పీ రేటింగ్ సాధించిన ఈ సీరియల్ రేటింగ్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది.
వంటలక్క, డాక్టర్ బాబు, మోనితలు లేని కార్తీకదీపం సీరియల్ సీరియల్ లోనే లేదని కాబట్టి మళ్ళీ వారు రీ ఎంట్రీ ఇవ్వాలి అని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.మొత్తానికి కార్తీకదీపం సీరియల్ కి పూర్వవైభవం రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.