ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా ఇప్పటికే 8 లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.అయితే కరోనా వైరస్ ను సంహరించే ఆయింట్ మెంట్ కు యూఎస్ఎఫ్ డీఏ ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వెల్లడించింది.
ఈ ఆయిట్ మెంట్ పేరు ఏపీటీ టీ3ఎక్స్ అని పేర్కొన్నారు.ఈ ఆయింట్ మెంట్ ను కొనుగోలు చేయడానికి వైద్యులు సిఫార్సు అక్కర్లేదని సంస్థ తెలిపింది.
టీ3ఎక్స్ తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్ కనిపించలేదని ప్రయోగశాల నివేదికలతో సహా తెలిపిందని అడ్వాన్స్ డ్ పెనెట్రేషన్ టెక్నాలజీ సంస్థ స్థాపకుడు, సీఈఓ డాక్టర్ బ్రియాన్ హ్యూబర్ అన్నారు.కరోనా వైరస్ నాసిక రంధ్రాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు టీ3ఎక్స్ కచ్ఛితంగా పనిచేస్తుందన్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుంది.ఒక శక్తివంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపాడు.టీ3ఎక్స్ కు సంబంధించి ఎఫ్ డీఏ ఆమోదం కూడా లభించిందన్నారు.ఈ మందులకు కొనుగోలు చేయడానికి మందుల చిట్టీ లేకుండానే కొనుగోలు చేయవచ్చన్నారు.
వైద్యుల సాయం లేకుండానే మందులు వాడవచ్చన్నారు.ఏపీటీ టీ3ఎక్స్ కరోనా వైరస్ (ఎన్ఎల్ 63), ఇన్ ఫ్లూయెంజా వైరస్ లపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అన్నారు.