స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ని ఉపయోగించుకొని సమాజంలో పలు రకాల సేవా కార్యక్రమాలలో భాగం అయ్యారు.బ్లడ్ బ్యాంకు, ఐబ్యాంకుతో పాటు చారిటీ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ భాటలోనే ఆయన పిలుపు మేరకు ఫాన్స్ కూడా చారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి పేరు మీద చారిటీ సొసైటీలు ఏర్పాటు చేసి తమ సేవాగుణం చాటుకుంటున్నారు.
ఇప్పుడు ఇదే దారిలో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా చేరుతున్నారు.ఎన్టీఆర్ పేరు మీద సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసారు.
సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారికి, అనాధలకి ఈ చారిటీ ద్వారా సాయం అందించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలని ఎన్టీఆర్ ఫాన్స్ ఆలోచించారు.దీని కోసం ఎన్టీఆర్ చారిటబుల్ సర్వీసెస్ పేరుతో ఈ సంస్థ ఏర్పాటు చేయనున్నారు ఈ ట్రస్ట్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి సాయం అందిస్తారు.
ఎన్టీఆర్ భావాలని ప్రజలలోకి తీసుకెళ్ళడంతో పాటు, ఆయన అభిమానులు అంటే సమాజ సేవకి ఎప్పుడు ముందుంటారు అని నిరూపించడానికి దీనిని మొదలుపెడుతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్ళడం, ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సినిమా తర్వాత అభిమానులతో సమావేశమై దీనికి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.