టాలీవుడ్లో హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో దక్కించుకుంది అందాల భామ నిధి అగర్వాల్.ఆ సినిమాలో అమ్మడి యాక్టింగ్ కంటే కూడా అందాల ఆరబోతకు జనాలు కనెక్ట్ అయ్యారు.
నిధి అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా కావడంతో ఆ సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.హీరో రామ్ పోతినేనితో కలిసి ఆమె చేసిన రొమాన్స్ కుర్రకారును ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది.
ఫలితంగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో టాలీవుడ్లో రెచ్చిపోవాలని చూసింది ఈ బ్యూటీ.
కానీ ఆమె అనుకున్నట్లుగా పెద్ద ఆఫర్లు ఏమీ రాకపోవడంతో, వచ్చిన ఆఫర్లను చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటూ వస్తోంది.అయితే ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఓ ప్రాజెక్ట్ను రెడీ చేస్తోంది.
జయం రవి హీరోగా తెరకెక్కుతున్న ‘భూమి’ అనే సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది.కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ, తమిళ భాషను నేర్చుకుంటోంది.
ఇప్పటికే తెలుగు మాట్లాడటం నేర్చుకున్న నిధి, ఇప్పుడు తమిళం కూడా నేర్చుకోవడంతో, కోలీవుడ్లో తన కెరీర్పై ఫోకస్ పెట్టింది.
అయితే తమిళంలో ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.
ఇక అందాల ఆరబోతతో పాటు అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించేందుకు నిధి రెడీ అంటోంది.మరి ఈ ఇస్మార్ట్ బ్యూటీకి ఇకనైనా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు దొరుకుతాయా లేదా అనేది చూడాలి.
ఇటు తెలుగులోనూ అమ్మడికి మంచి ప్రాజెక్టులు దొరకాలని, అవి సక్సెస్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.