కాంగ్రెస్ అసంతృప్త నేతలు నాగం జనార్థన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోన్నారు.
చేరికల అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు నాగం జనార్థన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు.నాగం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడిన కేసీఆర్ 1969 తెలంగాణ ఉద్యమంలో నాగం జైలుకు సైతం వెళ్లారని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14కు 14 సీట్లు గెలవాలని సూచించారు.అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను ఆయన ఖండించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కడతారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.