నేటి సమాజంలో వావివరసలు మర్చిపోయిన జనం మానవ సంబంధాలను మంటగలుపుతున్నారు.బంధువులే కదా అని నమ్మిన వారిని వారు నిండా ముంచేసి జీవితాలతో ఆడుకుంటున్నారు.
అయితే ఓ తల్లి మాత్రం తన పిల్లలకు ఎలాంటి కీడు జరగకూడదని, ముఖ్యంగా ఆడపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.కానీ కృష్ణా జిల్లాలో ఓ తల్లి అమ్మతనానికి మచ్చ తెచ్చే నిర్వాకం చేసింది.
కంచికచర్ల మండలం పరిటాలలోని ఓ తల్లి మార్తమ్మ తన మైనర్ కూతురిని తన పాత ప్రియుడి తంగిరాల రాంబాబు వద్దకు బలవంతంగా పంపింది.తనకు ఇష్టం లేకున్నా తల్లి బలవంతంగా ఆ కూతురిని వృద్ధుడి వద్దకు పంపింది.
దీంతో సదరు వృద్ధ ప్రియుడు ఆ మైనర్ బాలికను రాత్రంతా చిత్రహింసలకు గురిచేశాడు.తల్లి తన గోడు పట్టించుకోవడం లేదని తన నానమ్మ వద్ద ఆ మైనర్ బాలిక తన గోడును వెల్లబుచ్చుకుంది.
విషయం తెలసుకున్న నానమ్మ పోలీసులను ఆశ్రయించగా వారు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.నిందితుడు రాంబాబును అరెస్ట్ చేయగా తల్లి మార్తమ్మ పరారీలో ఉంది.
కన్నకూతురిపై ఇలాంటి చర్యకు పాల్పడిన మార్తమ్మ అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.