ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఈసీ.. !

ఎన్నికలు అనగానే అవకాశవాదులకు పండగలా ఉంటుంది.ఏంచక్కా తాగడానికి మందు, చేతి ఖర్చులకు డబ్బులు ఇంకేం కావాలి.

 Mlc Elections In Telugu States Cec Postponed, Ap, Telangana, Mlc Elections, Cec-TeluguStop.com

ఇలా ఎన్నికలకని అడ్దగోలుగా ఖర్చుపెడుతున్న నేతలను అడ్డుకునే వారు లేరు.ప్రజధనాన్ని నీళ్లలా ధారపోస్తూ తిరిగి జనాన్ని పీడీంచే రాజకీయాలు ప్రస్తుతం సమాజంలో చేస్తున్నారు.

దీనికి తోడు కరోనా అనే మహమ్మారి జలగలా ప్రజలను పీడిస్తున్న నేపధ్యంలో ఇదివరకే ఎన్నికలకు పోయిన రెండు రాష్ట్రాల నేతలు కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అయ్యారు.అందుకే ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

పలుచోట్ల ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కోసం నిర్వహించవలసిన ఎన్నికలను ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది.ఇకపోతే ఈ నెల 31తో ఏపీలో 3 స్థానాలకు, జూన్ 3తో తెలంగాణలోని 6 శాసన మండలి స్థానాలకు గడువు ముగియనుంది.

అందులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుందట.మొత్తానికి ఈ ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube