వారసత్వ రాజకీయాలు చెల్లవు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైనా ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్యే జలీల్ఖాన్ మండిపడ్డారు.రాజకీయ కుటుంబంలో వారసుడు రాజకీయ నాయకుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.పవన్, అతని కుటుంబసభ్యులు సినీ హీరోలు ఎలా అయ్యారని నిలదీశారు.2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కనీసం 18 సీట్లు అయినా వచ్చాయని గుర్తు చేసిన జలీల్ ఖాన్.వచ్చే ఎన్నికల్లో పవన్కు ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు.

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్పై కవాతు పేరుతో పిచ్చి ప్రేలాపనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కష్టాలకు ఎదురీదుతూ రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని.నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని జలీల్ఖాన్ హెచ్చరించారు.