ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంత హుందాగా వ్యవహరించాలో మంత్రి మల్లారెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఆయనకు ఇబ్బందులు తెస్తోంది.ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంచెం దూకుడుగా ఉంటే పర్వాలేదు గానీ ఒక మంత్రి స్థాయిలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ దూకుడు పని చేయదు.
ఇంకా చెప్పాలంటే చాలా హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది.కానీ ఆయన మాత్రం పదే పదే ఇలాగే వ్యవహరిస్తూ నవ్వుల పాలవుతున్నారు.
దీంతో ఆయనపై పార్టీలో కూడా అధిష్టానం సీరియస్ అవుతోంది.
ఇక రేవంత్ మొన్న సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఆయనకు కౌంటర్ వేసే క్రమంలో మంత్రి మల్లారెడ్డి మీడియా ముందు ఓ రేంజ్లో రెచ్చిపోయారు.రేవంత్ పై తిట్ల పురాణం ఎత్తుకున్నారు.అయితే గతంలో ఆయన ఎన్నడూ లేనంతగా ఈ విధంగా తిట్లు తిట్టడంలో భాగంగా రెచ్చిపోయి రేవంత్రెడ్డిని ఓ వర్గంతో పోల్చి వారిని తక్కువ చేసినట్టు మాట్లాడారు.దీంతో ఆ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
అయితే ఈ విషయంపై టీఆర్ ఎస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ అవుతోంది.
ఈ నేపథ్యంలో నిన్న మంత్రి మల్లారెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ తనను ఆ వర్గం క్షమించాలని, తాను తొందరపాటులో అలా మాట్లాడానని అంతేగానీ తనకు ఎవరి మీద అలాంటి ఉద్ధేశం లేదని తెలిపారు.ఈ ఘటనతో మరోసారి ఆయన మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.మరీ ఈ స్థాయిలో మాట్లాడటం ఏంటని ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఆయనపై గతంలో కూడా ఇలాగే ట్రోలింగ్ నడిచింది.కానీ ఈ సారి మరో రేంజ్లో ఆయనపై నెటిజ.
న్లు ఫైర్ అవుతున్నారు.ఇది కాస్తా ప్రతిపక్షాలకు మంచి ఊతంలా మారింది.