తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తల పెట్టనున్న “ప్రజా సంగ్రామ” పాదయాత్రపై మంత్రి కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటే దేనికి పాదయాత్ర చేస్తున్నారు అండి బండి సంజయ్ ని ప్రశ్నించారు.
పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల పాదయాత్ర చేస్తున్నారని సెటైర్లు వేశారు.కేవలం అధికారం కోసం పాదయాత్ర చేపడుతున్నారు అని మండిపడ్డారు.
గత ఏడాది అక్టోబర్ మాసంలో వరదలు వచ్చిన క్రమంలో గుజరాత్ రాష్ట్రానికి వెయ్యి కోట్లు.వేరే బీజేపీ పాలిత రాష్ట్రానికి 500 కోట్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి బిజెపి పార్టీ మొండిచేయి చూపించింది దాని కోసం… హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద నుండి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
దేశంలో ఆరు లక్షల కోట్ల ఆస్తులను బిజెపి అమ్మి వేస్తోంది అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు.పాదయాత్రలో ప్రజలకు… ఉద్యోగాల విషయంలో ఏం సమాధానం చెబుతారు బండి సంజయ్ అని ఫైర్ అయ్యారు.భారత దేశ జి.డి.పి పక్కన ఉన్న బంగ్లాదేశ్ కంటే తక్కువ పడిపోయిందని దానికోసమే బండి సంజయ్ పాదయాత్ర .?? అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారు.మహమ్మారి కరోనా విషయంలో దేశంలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా బిజెపి వ్యవహరించింది దాని కోసమే పాదయాత్ర.?? దేనికోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని ఇలాంటి తరుణంలో బండి సంజయ్.
పాదయాత్రకి పూనుకోవడం కేవలం అధికారం కోసమే అంటూ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్లు చేశారు.