తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివేదిక రూపొందించారు.రిపోర్ట్ టూ పీపుల్ పేరుతో కిషన్ రెడ్డి ఈ రిపోర్టును సిద్ధం చేశారు.
గతంలో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.వివిధ శాఖల ద్వారా తెలంగాణకు రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకరిస్తోందన్నారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని వెల్లడించారు.