ప్రస్తుత సమాజంలో ప్రేమ, ఆప్యాయతలకు విలువ లేకుండా పోతోంది.ప్రేమ పేరుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, చిన్న చిన్న మనస్పర్ధలకే విడిపోవడం సర్వసాధారణం అయింది.
ప్రస్తుతం యువతలో సర్దుకుపోయే లక్షణాలు ఏమాత్రం లేవు.కాబట్టి విడిపోవడానికి పెద్ద కారణాలు ఏమి అవసరం లేదు.
ఇంతవరకు బాగానే ఉంది.కానీ ప్రేమికులు కలిసి ఉన్నప్పుడు చనువుగా దిగిన ఫోటోలు, వీడియోలతో ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకుంటున్నారు.
ప్రేమించిన వ్యక్తులు దూరం పెడితే బ్లాక్ మెయిల్ చేయడమే కాక దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే… కర్ణాటక( Karnataka )లోని చిక్కనాయకనహాళ్లి లోని బట్టరహాళ్లి గ్రామానికి చెందిన సిద్ధరామయ్య అనే వ్యక్తి స్థానికంగా ఉండే సిద్ధ రామేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.ఇతనికి బి.ఎస్.వినయ్ కుమార్( Vinay Kumar ) (26) అనే కుమారుడు సంతానం.మరొకవైపు దొడ్డ బిదరే గ్రామానికి చెందిన జీవిత (17) తన తల్లితో కలిసి వినయ్ కుమార్ ఉండే బట్టర హాళ్లి లో నివాసం ఉంటుంది.
జీవిత తుమకూరు లో పీయూసీ చదువుతూ ఇటీవలే విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది.జీవిత, వినయ్ కుమారు లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈమధ్య ఈ ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావడంతో జీవిత.వినయ్ ను దూరం పెట్టేసింది.కానీ వినయ్ మాత్రం జీవిత తో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించాడు.జీవిత మాత్రం మాట్లాడేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు.ఈ క్రమంలో వినయ్, జీవిత ఇంటికి వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి అక్కడి నుండి ఎవరికి కనిపించకుండా పరారయ్యాడు.కుటుంబ సభ్యులు జీవిత ను ఆసుపత్రికి తరలించారు.
తరువాత కొన్ని గంటలకే గ్రామ శివారులో ఉండే కోనేరులో వినయ్ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా గ్రామం అంతా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు( Police ) కేసు నమోదు చేసి అసలు నిజాలు ఏంటో తెలుసుకునేందుకు అందరినీ విచారిస్తున్నారు.