విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం జరగడంతో ఆయన పాదయాత్రకు బ్రేక్ పడింది.అయితే ఆ యాత్ర సేవారం నుంచి ప్రారంభం కాబోతోంది.
ఇప్పటివరకు ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జగన్ విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు.
ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
తనపై హత్యాయత్నం జరిగిన తరువాత ఈ ఘటనపై జగన్ ఇప్పటి వరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.దాడి ఘటన తరువాత ఆయన మొదటిసారిగా విశాఖకు వస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శనివారం నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు.తనపై జరిగిన దాడి వ్యవహారం గురించి ఈ యాత్రలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.