చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇస్రో ఇప్పటికే సిద్ధం అయింది.
ఈ మేరకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి రాకెట్ ప్రయోగ వేదికను సిద్దం చేశారని తెలుస్తోంది.గగన్యాన్ ప్రయోగానికి ఇవాళ రాత్రి 7.30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుండగా సుమారు 12.30 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది.రేపు ఉదయం 8 గంటలకు గగన్ యాన్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
గగన్ యాన్ ప్రయోగం ద్వారా క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను భూమికి 17 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి ప్యారాచూట్ల సాయంతో తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు చేసేందుకు ఇది మొదటి అడుగు అవుతుందని సమాచారం.