విమాన ప్రయాణం చేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కానీ ఆ కోరిక ఓ వర్గం వారు మాత్రమే తీర్చుకుంటారు.
ఇక్కడ పేద, మధ్య తరగతి వారికి అది ఒక అందని ద్రాక్ష మాదిరి కనబడుతుంది.అయితే అప్పుడప్పుడు వారిని కూడా అంటే ఓ వసంతానికి ఒకసారి కొన్ని విమానయాన సంస్థలు ఊరిస్తూ ఉంటాయి.
కాగా ఇలాంటి సందర్భాలలో కొంతమంది వారి కోరికలు తీర్చుకుంటారు.ఈ క్రమంలోనే అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటైన AirAsia అదిరే ఆఫర్ ప్రకటించింది.
ఈ క్రమంలోనే చాలా చవుకైన ధరకే విమాన టికెట్లు అందుబాటులో ఉంచింది.
కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని వినియోగదారులు ఇక్కడ గుర్తించుకోవాలి.ఆలోచించినా ఆశాభంగం అన్నట్టు మీలో ఎవరన్నా విమానయానం చేయాలనుకుంటే ఈ కొత్త ఏడాది ఫ్లైట్ జర్నీ చేసేయండి.
ఎందుకంటే ఈ టికెట్ ధర డిస్కౌంట్ ఆఫర్ ఇప్పటికే ముగియాల్సి ఉండగా కంపెనీ మాత్రం ఈ సేల్ను పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.అంతే కాకుండా టికెట్ ధరలను కూడా మరింత తగ్గించేయడం గమనార్హం.
మొదటిసారి రూ.1497తో విమాన టికెట్లు పొందొచ్చని కంపెనీ ప్రకటించగా ఈ సేల్ డిసెంబర్ 25తోనే ముగియాల్సి ఉండగా తాజాగా కంపెనీ ఈ సేల్ను పొడిగించింది.కంపెనీ అదిస్తున్న ఈ డిస్కౌంట్ సేల్ డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉండనుంది.అందువల్ల మీరు విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే ఈ ఆఫర్ తక్షణమే పొందండి.
ఇక ఈ విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు 2023 జనవరి 10 నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.