హైదరాబాద్ సరూర్ నగర్ అప్సర మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.పోలీస్ కస్టడీలో నిందితుడు సాయికృష్ణ సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.
మహిళను హత్య చేయడానికి 15 రోజుల ముందే నిందితుడు సాయికృష్ణ గొయ్యి తవ్వాడు.సరూర్ నగర్ లో గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ స్థలంలో పాతిపెట్టాలని ప్లాన్ చేశాడని, ఇందుకోసం 20 అడుగుల గొయ్యి తవ్వించాడని గుర్తించారు.
అయితే ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో గొయ్యిని మూసివేశారు.దీంతో ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న స్థలంలో తన ప్లాన్ అమలు చేశాడు.
తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో సాయికృష్ణ వెల్లడించాడు.