బెంగళూరుకు చెందిన అడ్వాన్స్డ్ బ్యాటరీ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ స్టార్టప్ అయిన లాగ్9 మెటీరియల్స్ తాజాగా ఓ రికార్డు సృష్టించింది.ఈ కంపెనీ జక్కూర్లోని తన క్యాంపస్లో భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య లిథియం-అయాన్( Commercial lithium-ion ) (లి-అయాన్) సెల్ తయారీ కేంద్రాన్ని లాంచ్ చేసింది.
ఈ సదుపాయం ప్రారంభ సామర్థ్యం 50 MWh కాగా ఇది భారతీయ ఆపరేటింగ్ కండిషన్స్, వాతావరణం, ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది.ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లిథియం-టైటనేట్ ఆక్సైడ్( Lithium-titanate oxide ), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్( Lithium iron phosphate cells ) తయారు చేస్తుంది.
కంపెనీ పలు రకాల RapidX ఈవీ బ్యాటరీలతో కూడిన విస్తృతమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియోను కూడా కలిగి ఉంది.

కంపెనీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రాపిడ్ఎక్స్ 2000( RapidX 2000 ), మూడు చక్రాల కోసం రాపిడ్ఎక్స్ 6000, 8000, నాలుగు చక్రాల కోసం రాపిడ్ఎక్స్ 12000, 15000 తయారు చేస్తోంది.Log9 తన బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ చార్విక్ను కూడా ప్రారంభించింది, ఇది అత్యాధునిక పవర్ కంట్రోల్ మెకానిజమ్లతో విలీనం అయింది.కంపెనీ తన అకడమిక్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్, లాగ్9 రైజ్ను కూడా ప్రకటించింది.
ఇది భారతదేశంలో బ్యాటరీ టెక్నాలజీలలో టాలెంట్ పూల్ను రూపొందించడానికి మద్దతు ఇస్తుంది.

లాగ్9 మెటీరియల్స్ సీఈఓ డా.అక్షయ్ సింఘాల్( CEO Dr.Akshay Singhal ) మాట్లాడుతూ, కంపెనీ ఇప్పటి వరకు దాదాపు 3,000 బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిందని, దాదాపు 5.5 మిలియన్ కిలోమీటర్లు కవర్ చేశామని తెలిపారు.ఢిల్లీ, బెంగుళూరు, చెన్నైతో సహా భారతదేశంలోని 20 నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరించింది.లాగ్9 సెల్లు భారతీయ ఆపరేటింగ్ పరిస్థితులు, వాతావరణం, కస్టమర్లకు సరిపోయేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.మొత్తం మీద, Log9 మెటీరియల్స్ కొత్త సదుపాయం భారతదేశ స్థిరమైన శక్తి, విద్యుత్ మొబిలిటీ సాధనలో ఒక ముఖ్యమైన అభివృద్ధి.
ఇక కంపెనీ బ్యాటరీలు భారతీయ ఆపరేటింగ్ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుంది.కాబట్టి కంపెనీ ఈ విషయంలో భారతదేశాన్ని సెల్ఫ్-రిలయంట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలువురు భావిస్తున్నారు.