మార్కెట్లో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో వాటిని ఎంపిక చేసుకుని సాగు చేస్తేనే అధిక లాభాలు అర్జించవచ్చు.మెంతులను భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తారు కాబట్టి మెంతులకు( Fenugreek ) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
మెంతులను ఆకుకూరగా సాగు చేస్తే 25 రోజులు, గింజల కోసం సాగు చేస్తే 100 రోజుల సాగు వ్యవధి ఉంటుంది.మెంతులు ఎలాంటి వాతావరణం లో అయినా తట్టుకొని పెరుగగలదు.
ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది.
మెంతులలో మేలురకం విత్తనాల విషయానికి వస్తే.కో 1, హెచ్ 103, ఇసి 4911, మేధి నెం 14, ఆర్ ఎంటి 1, లాం సెలక్షన్ లాంటి రకాల లో ఏదో ఒక రకం ఎంపిక చేసుకుని సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.మెంతులు వేసే ముందు నేలను రెండుసార్లు లోతు దుక్కులు దున్నుకొని భూమిని చదును చేసుకోవాలి.
మడులు ఏర్పాటు చేసుకుని వాటిపై విత్తనాన్ని వెదజల్లుకోవాలి.మొక్కల వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగలడంతో పాటు పొలంలో అంతర కృషి చేయడానికి సులభంగా ఉంటుంది.
ఒక ఎకరం పొలానికి 10 కిలోల విత్తనాలు అవసరం.పొలంలో వేసిన ఎనిమిది రోజులకు విత్తనం మొలకెత్తడం ప్రారంభం అవుతుంది.ఎరువుల విషయానికి వస్తే.సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.ఆఖరి దుక్కిలో ఒక ఎకరం పొలానికి ఐదు టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నుకోవాలి.ఇంకా 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం( Phosphorus ), 50 కిలోల పోటాష్ ఎరువులు( Potash fertilizers ) అవసరం.
విత్తుకునే సమయంలో సగం నత్రజని మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను పొలంలో వేసుకోవాలి.మెంతి ఆకులు కత్తిరించిన తర్వాత ఆ సగం నత్రజని ఎరువును పొలంలో వేసుకోవాలి.
నేలలోని తేమ శాతాన్ని బట్టి పది రోజులకు ఒకసారి నీటి తడిని అందించాలి.